ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. రొమాంటిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమరణలో జీఏ2 బ్యానర్ పై బన్ని వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అఖిల్ – పూజ ల జంట స్క్రీన్ మీద బావుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో అఖిల్ 5 వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. కాగా అఖిల్, చైతూ లతో నాగార్జున మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమాని కంప్లీట్ చేసి ఉన్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో బాగా బజ్ క్రియోటయింది.
ఇక ఈ త్వరలో చైతూ విక్రం కుమార్ తో థ్యాంక్యూ అన్న సినిమాని చేయబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ హీరోయున్ గా నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుందట. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలో నాగార్జున.. చైతూ-అఖిల్ తో మల్టీస్టారర్ నిర్మించాలని.. అందుకు కథలు వింటున్నట్టు తెలుస్తోంది.