Nayanatara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి తెలుగు, తమిళ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్గా మారింది. సౌత్ లోనే నంబర్ వన్ స్థానంలోనూ నయనతార నిలిచిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభించి 15 ఏళ్ళు అవుతున్నా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా అంతకు రెట్టింపు అయింది. దాంతో ఈమె డేట్స్ కోసం మేకర్స్ పోటీ పడుతున్నారు. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న సీనియర్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసింది నయనతార. ఆమె క్రేజ్ తో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
ఈ క్రమంలో నయనతార గత కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తోంది. గత ఏడాది అమ్మవారి పాత్రలో నయన నటించిన మూకుట్టి అమ్మన్, తెలుగులో అమ్మోరు తల్లిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇటు తెలుగులో రిలీజైన డబ్బింగ్ వర్షన్, అటు తమిళంలో వచ్చిన ఒరిజనల్ వర్షన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది నయనతార. ఈ సినిమా నెట్రికన్ పేరుతో రూపొందుతోంది. ఇటీవలే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. థియేటర్స్ ఓపెన్ కాకపోయినా కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయంలో నయనతార కూడా నిర్మాతలకి సపోర్ట్ చేస్తోంది.
Nayanatara : నయన్ కి ఇది బాలీవుడ్ లో మంచి హిట్ మూవీగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.
ఇక విజయ్ సేతుపతి, సమంత అక్కినేని లతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఇది ద్విభాషా చిత్రంగా రిలీజ్ కానుందని సమాచారం. కాగా బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ సరసన హిందీ, తమిళ సినిమా చేయబోతుందట. తమిళ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. వాస్తవంగా ఈ సినిమా గత ఏడాదే మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. కాగా త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలవబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున పఠాన్ సినిమా కంప్లీట్ అవగానే ఇది మొదలవబోతుందట. సోషల్ మెసేజ్ తో పాటు కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గానూ దర్శకుడు అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇక నయన్ కి ఇది బాలీవుడ్ లో మంచి హిట్ మూవీగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.