Nayanatara: సీనియర్ హీరోయిన్గా నయనతారకి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తోంది. ఇంతకముందు వీరిద్దరు కలిసి దర్భార్ సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. అయినా మరోసారి నయనతారకి ఉన్న క్రేజ్ కారణంగా రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఎంచుకున్నారు. ఇందులో కీర్తి సురేశ్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక నయనతార ఆమె కాబోయో భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో కూడా నటిస్తోంది. సమంత అక్కినేని, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత తాజాగా ఈ మల్టీస్టారర్ సినిమాలో జాయిన్ అయింది. ఈ ఏడాదే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఇలా ఇక ఇటీవల నయనతార నటించిన నేట్రికన్ ఓటీటీలో రిలీజై ఆకట్టుకుంది. మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న నయనతారకి మరోసారి మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది.
Nayanatara: నయనతారను మేకర్స్ అధికారకంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల మెగాస్టార్ ఆచార్య సినిమా కంప్లీట్ చేశారు. తాజాగా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ను సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుంచి మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయో అప్డేట్ రానుందని సమాచారం. ఇక ఇందులో సిస్టర్ రోల్కి కీర్తి సురేశ్ పేరు వినిపిస్తుండగా కీలక పాత్ర కోసం నయనతారను ఫైనల్ చేశారట. త్వరలో ఆమెను మేకర్స్ అధికారకంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నయన్ మెగాస్టార్తో కలిసి సైరాలో నటించింది.