మొదటి రెండు సినిమాలతో నిధీ అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కాని స్టార్ హీరోయిన్ అన్న పేరు మాత్రం దక్కలేదు. అందుకు కారణం ఆ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి కాబట్టి. కాని దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధీ అగర్వాల్ టాలీవుడ్ లో సెటిలయింది. ఈ సినిమాతో మంచి సక్సస్ అందుకొని మంచి అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మాస్ మహారాజా రవితేజ నటించబోతున్న సినిమాలోను నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది నిధీ. ఈ క్రమంలో తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ లో మరో రికార్డు అందుకుంది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నిధి అగర్వాల్ ఫేస్ బుక్ లో 8.5 మిలియన్ ఫాలోవర్స్ ని రీచ్ అయింది. మరోవైపు ఈ బ్యూటీకి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నిధిని ఇంస్టాగ్రామ్ లో 5.4 మిలియన్స్ ఫాలో అవుతుండగా.. ట్విట్టర్ లో 5 లక్షలమంది ఫాలో అవుతున్నారు. మొత్తానికి నిధి కూడా మిగతా హీరోయిన్స్ మాదిరిగా హైయ్యెస్ట్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని సాధించింది. ఇక నిధీ అగర్వాల్ ముందు బాలీవుడ్ లో “మున్నా మైఖేల్” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి మళ్ళీ హిందీలో సినిమా చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఒకవైపు ఆ ప్రయత్నాలు చేస్తోంది నిధీ.