హైదరాబాది అయిన నిధి అగర్వాల్.. ముంబైలో సెటిల్ అయింది. సినిమా రంగం అంటే ఆసక్తితో ‘మున్నా మైకెల్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే టైగర్ ష్రాఫ్ తో నటించడంతో బాలీవుడ్ దృష్టి నిధి మీద పడింది. మున్నా మైకెల్ సినిమాలో నిధి ప్రేక్షకులను, మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. కాని ఎందుకనో అవకాశాలే దక్కలేదు. ఆ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో వరసగా అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న నిధి కి ఆ సినిమా ప్లాప్ గా మిగిలింది. అయిన అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
కాని పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో ముద్దులు..స్కిన్ షో తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా హిట్ అవడం..గ్లామర్ గా కనిపించడంతో నెమ్మదిగా నిధి ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రవితేజ సినిమాలో ఫైనల్ అయిందన్న న్యూస్ కూడా బాగా వైరల్ అవుతోంది.
ఇక రీసెంట్ గా నిధీ తన లవ్.. బ్రేకప్.. క్రష్.. లను రివీల్ చేసింది. చిన్నప్పుడు నాలుగవ తరగతి చదివేటప్పుడే.. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట ఈ ఇస్మార్ట్ బ్యూటీ. అది ఒక స్వీట్ మెమరీలా ఇప్పటికి గుర్తుండిపోయిందట. ఇక కాలేజ్ టైంలోనూ ఒక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు చెప్పి షాకిచ్చింది. అంతేకాదు అతను లవ్ ప్రపోజ్ చేసిన విధానం ఎప్పటికి మరచిపోలేదట. మరి ఇప్పటికీ అతని తో లవ్ లో ఉందా లేదా మాత్రం సస్పెన్స్ లో ఉంచేసింది.
అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ అంటే పిచ్చి అంటూ ఆయనంటే చెప్పలేనంత అభిమానం అంటూ తెలిపింది. ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్ అవకాశం వచ్చినా చాలంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది. మరి షారుఖ్ సినిమా కాకపోయినా బాలీవుడ్ నుంచి మళ్ళీ ఆఫర్ వస్తుందేమో చూడాలి.