Nithya menon : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చినా కూడా ఆయన క్రేజ్ రెట్టింపు అయింది తప్ప కాస్త కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి రానాతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియుమ్’ తెలుగు రీమేక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా యాభై శాతం పైగా చిత్రీకరణ పూర్తి అయింది. ఇప్పుడు హైదరాబాద్
అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్- నిత్యా మీనన్ మీద చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాను సాంగ్స్ తో సహా టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ తో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకే షూటింగ్ కూడా జరుపుతున్నారు. 2022 సంక్రాంతికి థియేట్రికల్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 12న డేట్ కూడా లాక్ చేసారు. ఇక ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందిస్తున్నారు.
Nithya menon : ది బెస్ట్ ఇవ్వడానికి అన్నీ రకాలుగా ట్రై చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. భీమల నాయక్ పాత్రలో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన లుక్ వచ్చి సినిమా మీద భారీ అంచనాలు రేపింది. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ కి పోటా పోటీగా నిత్యా మీనన్ నటిస్తుందట. పర్ఫార్మెన్స్ లో ఆమె కాస్త కూడా కాంప్రమైజ్ కాని సంగతి తెలిసిందే. కథ అందులో పాత్ర నచ్చితే ఆమె ఎంతైనా శ్రమించి పాత్రలో జీవిస్తుంది. ది బెస్ట్ ఇవ్వడానికి అన్నీ రకాలుగా ట్రై చేస్తోంది. అలాగే భీమల నాయక్ తో గట్టిగా పోటీ పడుతుందట. చూడాలి మరి ఏమేరకు నిత్యా మీనన్ ఈ సినిమాలో ఆకట్టుకుందో.