పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో రూపొందుతున్న 20 వ సినిమా ‘రాధే శ్యామ్’. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని… ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే నటించనుందని రీసెంట్ గా అధికారకంగా చిత్ర యూనిట్ వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందట. ఆ హీరోయిన్ గా టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.
ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. ప్రస్తుతం నివేదా థామస్, నాని వి సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్న మేకర్స్ 4 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.