Mahesh : మహేష్ బాబుకి జంటగా నివేథా థామస్ నటిస్తుందా..అవుననే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలోనూ..సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వి సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చిన నివేథా థామస్ ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్లో వేముల పల్లవిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా హైలెట్గా నిలవడమే కాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. వి తర్వ త నివేథా థామస్ సోలో హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో ఇక అమ్మడు టాలీవుడ్లో కనిపించదని చెపుకున్నారు.
కానీ నివేథా ఫేట్ వకీల్ సాబ్ మార్చేశాడు. ఈ సినిమా తర్వాత వరుసగా క్రేజీ అండ్ స్టార్స్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటోందట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో సర్కారు వారి పాట రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం తో ఓ సినిమా చేస్తున్నాడు.
Mahesh : మహేష్ సినిమాలో నివేథాది ఎలాంటి పాత్ర అనే ఆరాటం అందరిలోనూ మొదలైంది.
త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రకి నివేథా థామస్ పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఈ పాత్రకి ఈమెనే ఫైనల్ అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. థమన్ ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేశాడట. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు. ఇక 2022 సమ్మర్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి మహేష్ సినిమాలో నివేథాది ఎలాంటి పాత్ర అనే ఆరాటం అందరిలోనూ మొదలైంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?