శ్రీ విష్ణు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్లో అండ్ స్టడీ అన్న ఫార్ములాని ఫాలో అవుతూ సక్సస్ ని అందుకుంటున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో మంచి క్యారెక్టర్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీ విష్ణు నటించిన సినిమాలలో బాగా గుర్తుండిపొయే సినిమాలు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘మెంటల్ మదిలో’ ‘నీది నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ ‘ఉన్నది ఒకటే జిందగీ’. తెలుగు చిత్ర పరిశ్రమలో బిజి హీరోగా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
కాగా శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సినిమాని శ్రీ విష్ణు షూటింగ్ కూడా త్వరలో కంప్లీట్ కాబోతోందట. ఇక ‘గాలి సంపత్’ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే 80శాతం కంప్లీట్ చేసాడు. కాగా ‘గాలి సంపత్’ సినిమా ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తుండగా అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలన్ని లైన్ లో ఉండగానే శ్రీవిష్ణు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాని లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతుండగా .. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక ప్రత్యేకమైన పాత్రతో ప్రయోగం చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా 2021 ప్రథమార్ధం లో ప్రారంభం కాబోతుందట. 2019లో ‘తిప్పారా మీసం’సినిమాతో శ్రీ విష్ణు ప్లాప్ ని చూశాడు. అయినా వరసగా సినిమాలని కమిటవుతూ 2021లో నాలుగు క్రేజీ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. చెప్పాలంటే శ్రీవిష్ణు లాగా మరే యంగ్ హీరో ఇన్ని సినిమాలు చేయడం లేదని చెప్పుకుంటున్నారు.