జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఊసరవెల్లి సినిమాలో నటించిన పాయల్ ఘోష్ అనే హీరోయిన్ ఇప్పుడు వార్తల్లోకొచ్చింది.సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత సినీ ఫీల్డులో నట వారసత్వ హీరోల గురించి పెద్ద స్థాయిలో చర్చ జరిగింది.ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నట వారసత్వ బ్యాచేనని నెటిజన్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాయల్ గోష్ స్పందించింది.జూనియర్ ఎన్టీఆర్ ని ఆ కోణంలో చూడొద్దంటూ ట్వీట్ చేసింది.అదే ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
ఏ మాత్రం సంబంధం లేకుండానే పాయల్ గోష్ అకారణంగా ఎన్టీఆర్ ను వెనుకేసుకొస్తోంది ఎన్టీఆర్ పై జాలి పడండి, గర్వించండి అంటూ ట్వీట్ లు చేస్తుంది. . ఎన్టీఆర్ మంచి సినిమా కుటుంబం నుండి వచ్చారని కానీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ గతం గురించి తెలుసుకున్న తాను ఏడ్చేశానని ఆమె చెప్పింది .ఎన్టీఆర్ పై జాలి చూపండి ఎన్టీఆర్ కు గౌరవం ఇవ్వండి అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ను తాను ఎందుకు వెనకేసుకొస్తుందో అది ఎవ్వరికీ అర్థం అవ్వదని పాయల్ గోష్ పేర్కొంది
అయితే పాయల్ ఘోష్ ట్వీట్లపై సహజంగానే నెటిజన్లు విరుచుకుపడ్డారు .దీంతో ఆమె తనని అందరూ అనవసరంగా దూషిస్తున్నారని ఆమె మరో ట్వీట్ చేసింది.అంతేగాక నేను డిప్రెషన్ పేషంట్ ను నన్ను దయచేసి హింసించకండి మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను అంటూ పాయల్ గోష్ అర్థించింది
ఇక్కడ పాయల్ గోష్ అసలు ఎందుకు ఈ వివాదంలో వేలెట్టి౦దన్నది ఎవరికీ అర్థం కాని విషయం.ఆమె నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ని సమర్థిస్తోందా లేక ఆయన అభిమానులను రెచ్చగొడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఏదేమైనా ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో హీరోయిన్లకు టార్గెట్ అవుతున్నారు.నిన్న కాక మొన్న మీరా చోప్రా కూడా ఆయన మీద కామెంట్లు చేసి వివాదం రేపిన విషయం ఇక్కడ గమనార్హం తాజాగా పాయల్ గోష్ రంగప్రవేశం చేసింది ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.