టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్ళి కి సిద్దమవుతున్నాడు. శాలిని తో నితిన్ వివాహం ఈ జూలై 26 న హైదరాబాద్ ఫలక్ నుమా ఫ్యాలెస్ లో ఘనంగా జరగనుండగా అతి కొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు కానున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ తన సన్నిహిత వర్గాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా కలిసి ఇన్విటేషన్ ఇచ్చి తప్పని సరిగా తన పెళ్ళికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరాడు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ తో పాటు అభిమానుల్లోను ఒక న్యూవ్ హాట్ టాపిక్ అవుతోంది. అదే నితిన్ పెళ్ళికి తన ఫేవరేట్ హీరో, జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పిలిచాడా అని. ఆయనని కూడా కలిసి ఆహ్వానిస్తే ఆ పిక్ ఏదైనా సొషల్ మీడియాలో దర్శనమిస్తే ఇలాంటి అనుమానాలు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు అందరూ ఈ విషయమై చర్చించుకుంటున్నారు.
కాని తాజా సమాచారం ప్రకారం నితిన్ కి ఎంతగానో ఇష్టమైన పవన్ కళ్యాణ్ కూడా పెళ్ళికి హాజరవబోతున్నాడట. పవన్ కళ్యాణ్ కి నితిన్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రం, ప్రముఖ కమెడియన్ ఆలి, సమంత, కీర్తి సురేష్ ..ఇలా నితిన్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న సినీ ప్రముఖులందరూ హాజరవనున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమాలో నటిస్తుండగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాను.