పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో ఒక పీరియాడికల్ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కాని క్రిష్ అనుకున్న భారీ ప్లాన్ ని కరోనా గట్టి దెబ్బకొట్టింది. ఈ సినిమా మొదలయ్యాక 15 రోజుల షెడ్యూల్ మాత్రమే సాగింది. ఆ తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కోటి రూపాయల సెట్ కూలిపోవడం ఆ తర్వాత లాక్ డౌన్ తో పవన్ కళ్యాణ్ క్రిష్ ల సినిమా ఆగిపోయింది.
అయితే వకీల్ సాబ్ సినిమా రీసెంట్ గా కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. కాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం సినిమాలో నటించాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ దిశగానే మేకర్స్ ప్లాన్ చేశారట. కాని ఇంకా ఈ సినిమాకి కాస్టింగ్ ఫైనల్ కాకపోవడం తో ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ఇంకా కాస్త సమయం పడుతుందట. అందుకే క్రిష్ లెక్క సరి చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడయినట్టు లేటెస్ట్ అప్డేట్. మొగలాయిల కాలం నాటి కథ తో క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ గా కనిపిస్తాడని సమాచారం.
ఇలాంటి కథ లను తెరకెక్కించడం లో క్రిష్ సిద్దహస్తుడు. గౌతమీ పుత్ర శాతకర్ణి, కంచె లాంటి సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఈ సినిమాతో ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ మలయాళ సినిమా ముందు చేయాల్సి రావడంతో పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా డిలే అవుతుందనుకున్నారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయి ముందు అనుకున్న ఆర్డర్ లోనే సినిమా షూటింగ్ మొదలవబోతోందని తాజా సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!