Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నిర్మాతగా సినిమా ప్లాన్ చేస్తున్నాడా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లోనూ, ఫిలిం సర్కిల్స్లోనూ అదే న్యూస్ వైరల్ అవుతోంది. మూడేళ్ళ పాటు రాజకీయాలంటూ సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్..మళ్ళీ అభిమానుల కోరిక మేరకు ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. దీని తర్వాత ఆయన అన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ను కమిటయ్యారు. వీలైనంత త్వరగా కమిటయిన సినిమాలను పూర్తి చేయాలనుకున్న పవన్ కళ్యాణ్కు కరోనా వేవ్ బాగా దెబ్బకొట్టాయి.
మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగేసరికి సెట్స్ మీదకు వచ్చారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఇటీవల వికారాబాద్ అడవుల్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జనవరి 12 భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ తేదీని కూడా కన్ఫర్మ్ చేశారు.
అలాగే హరి హర వీరమల్లు, సురేందర్ రెడ్డి సినిమా, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా..హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. హీరోగా ఇన్ని సినిమాలు చేయాల్సిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నిర్మాతగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. గతంలో ఆయన నిర్మాణంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, ఛల్ మోహన రంగ ఫ్లాప్గా మిగిలాయి. ఆ తర్వాత ఆయన నిర్మాణంలో సినిమా రాలేదు. మళ్ళీ ఇప్పుడు నిర్మాతగా అంటే ఖచ్చితంగా అది కొడుకు అకీరా నందన్ లాంచింగ్ ప్రాజెక్టే అని చెప్పుకుంటున్నారు. చూడాలి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…