2020 ప్రారంభంలోనే అల వైకుంఠపురములో సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే. వాస్తవంగా పూజా హెగ్డే నటించిన మొదటి రెండు సినిమాలు ముకుంద, ఒక లైలా కోసం చూస్తే ఎవరూ స్టార్ హీరోయిన్ గా సెటిలవుతుందని ఊహించరు. కాని పూజా తన టాలెంట్ ఏంటో ఒక్కో సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే కి ఉన్న డిమాండ్ మామూలుది కాదు. ఏ స్టార్ హీరో సినిమా ప్రస్తావనకి వచ్చిన, ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా నే అనుకుంటున్నారు.
అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న పూజా హెగ్డే ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ ..ఇలా దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. అంతేకాదు ఇప్పుడు పూజా హెగ్డే కి బాలీవుడ్ నుంచి వరసగా స్టార్ హీరోలు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి.
కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో “మొహంజదారో” సినిమాలో నటించింది. కాని ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మళ్ళీ బాలీవుడ్ లో పూజా హెగ్డే కి అవకాశాలు రాలేదు. చాలానే ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో ఒక సినిమా కి కమిటయిన పూజా కి, సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలకి పూజా అందుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉందని సమచారం. ఇక ప్రభాస్ రాధే శ్యాం కూడా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!