Radhe shyam : రాధేశ్యామ్ సినిమా జూలై 30న భారీ స్థాయిలో అన్నీ సౌత్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులు షాకయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా రాధేశ్యామ్ రూపొందుతోంది. ప్రభాస్కి జంటగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమ కథ ఎంతో అద్భుతంగా వెండితెరమీద ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ.
కాగా ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ బ్యానర్స్ సమర్పణలో యూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీ – ప్రమోద్ – ప్రసీద భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయి పోస్ట్ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఎక్కువగా వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ ఉన్న కారణంగా అభిమానులు అంతగా ఎదురు చూస్తున్నా కూడా టీజర్ని రిలీజ్ చేయలేకబోతున్నట్టు సమాచారం.
Radhe shyam : రాధేశ్యామ్ కొన్ని సీన్స్ని మళ్లీ చేద్దాం అని ప్రభాస్ అన్నాడా..?
కాగా రీసెంట్గా ఈ సినిమా రషెష్ని ప్రభాస్ చూసినట్టు సమాచారం. అయితే కొన్ని సీన్స్ని మళ్లీ చేద్దాం అని దర్శకుడు రాధాకృష్ణతో చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇంతవరకు మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అంటే రీ షూట్ అన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.