Salaar : సలార్.. టాలీవుడ్లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో గ్రాండ్గా రూపొందిస్తుండటం ఇంట్రెస్టింగ్ విషయం. ఇప్పటికే గోదావరి మైన్స్లో భారీ సీన్స్ తెరకెక్కించారు. ఆ తర్వాత మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి కరోనా కారణంగా ఈ షెడ్యూల్ ఆగిపోయింది.
కాగా వచ్చే నెల నుంచి సలార్ తాజా షెడ్యూల్ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్లో ఆతృతను విపరీతంగా పెంచుతోంది. ఇంతక ముందు ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇలాగే వైరల్ అయింది. అదేమిటంటే ప్రభాస్ సలార్లో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని. తండ్రీ కొడుకులుగా అభిమానులను అలరించనున్నాడని చెప్పుకున్నారు. బాహుబలి సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన ప్రభాస్ దేశ వ్యాప్తంగా తన రేంజ్ చూపించాడు.
Salaar : ప్రభాస్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
సలార్లో మరోసారి తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం తండ్రీ కొడుకులుగా కాదట. అన్నదమ్ములుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ అన్నదమ్ములుగా నటించింది లేదు. కాబట్టి సలార్లో ఈ కాన్సెప్ట్ అదిరిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇక క్లైమాక్స్ వరకు ప్రభాస్ రెండు పాత్రలు రివీల్ కావని తెలుస్తోంది. ఇదే నిజమైతే సలార్ భారీ హిట్ అని ఫికవ్వొచ్చు. కాగా రాధే శ్యాం తో ఈ ఏడాది రాబోతున్న మన పాన్ ఇండియన్ స్టార్ వచ్చే ఏడాది సలార్, ఆదిపురుష్ సినిమాలతో రానున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?