Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మార్కెట్ హిందీ మార్కెట్ మీదేనా ..గత కొన్ని రోజులుగా ఇదే మాట టాలీవుడ్ మేకర్స్ తో పాటు బాలీవుడ్ మేకర్స్ లోనూ వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బాహుబలి తర్వాత ఈయనకి హిందీ ఇండస్ట్రీ నుంచి వరుసగా బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చాయి. కానీ ఎందుకనో ప్రభాస్ అప్పుడు ఆసక్తి చూపించలేదు. అయినా బాలీవుడ్ మేకర్స్ మన డార్లింగ్ ని వదలలేదు. ఎట్టకేలకి ఆదిపురుష్ సినిమాతో స్ట్రైట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.
ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న రాధే శ్యాం లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 250 కోట్ల బడ్జెట్ తో వంశీ ప్రమోద్ ప్రసీద నిర్మిస్తున్నారు. తెలుగులో కృష్ణం రాజు ..హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ కూడా బాలీవుడ్ మార్కెట్ మీదే అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎన్నుకున్నారు చిత్ర బృందం. ఈ ఏడాదే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.
Prabhas : ప్రభాస్ అసలు టార్గెట్ బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టడమేనట.
ఆదిపురుష్ పౌరాణిక చిత్రంగా రూపొందుతోంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్ లో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ జరపనున్నారు. అలాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ తెరకెక్కుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. తెలుగు తో పాటు మిగతా సౌత్ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాల అసలు టార్గెట్ మాత్రం బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టడమేనట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?