Prashanth neel : కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా మహా అయితే 4 నుంచి 5 కోట్ల బడ్జెట్ లోపే సినిమాలు నిర్మిస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే అది కూడా ఎక్కువే. అక్కడ ఉండే మార్కెట్ కి హీరోల క్రేజ్ కి ఇదే హై బడ్జెట్. సౌత్ లో అన్నిటికంటే చిన్న పరిశ్రమ కన్నడనే. అక్కడి దర్శకులు కూడా ఒక మోస్తారు బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. అయితే ఉగ్రం సినిమాతో అక్కడ స్టార్ డైరెక్టర్ గా సత్తా చాటాడు ప్రశాంత్ నీల్. కన్నడలోనే కాదు ఈ సినిమా సక్సెస్ సౌత్ మొత్తంలో తెలిసింది. ఆ క్రేజ్ వల్ల యష్ హీరోగా కేజీఎఫ్ చాప్టర్ 1 రూపొందించాడు.
ఈ సినిమా సౌత్ సినిమా అన్నీ ఇండస్ట్రీలలో మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకుంది. దాంతో హీరో యష్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లకి పాన్ ఇండియన్ స్థాయిలో పేరొచ్చింది. ఈ సినిమా సక్సెస్ దెబ్బకి తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలు ఈయన డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 1 కి సీక్వెల్ రెడీ చేశాడు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 గా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియన్ స్థాయిలో అన్నీ సౌత్ లాంగ్వేజెస్ లో భారీగా రిలీజ్ చేయనున్నారు.
Prashanth neel : దాదాపు 2023 వరకు ఈ డైరెక్టర్ బిజీగా ఉన్నాడు.
ఇది రిలీజ్ కాకుండానే యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ అనే సినిమాను ప్రభాస్ తో తీస్తున్నాడు. శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా జరిగింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేందుకు దర్శక, నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ సినిమా తర్వాత తారక్, అల్లు అర్జున్ లైన్ లో ఉన్నారు. అలాగే డీవీవీ దానయ్య కూడా ఈ డైరెక్టర్ తో ఓ భారీ బాడ్జెట్ కేటాయించి పాన్ ఇండియన్ సినిమా నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. దాదాపు 2023 వరకు ఈ డైరెక్టర్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఒకరకంగా రాజమౌళిని మించిపోయేలా ఉన్నాడని మాట్లాడుకుంటున్నారట.