Shakumtalam : శాకుంతలం సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్. కావ్య నాయకి శాకుంతలంగా నటిస్తుంది సమంత అక్కినేని. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే శకుంతలంగా గుణశేఖర్ ఎవరిని తీసుకుంటాడా అన్న చర్చలు మొదలయ్యాయి. కానీ సమంత అని మాత్రం ఎవరూ ఊహించలేదు. అలా ఊహకందని విధంగా దర్శకుడు గుణశేఖర్ సమంతని అనౌన్స్ చేసి షాకిచ్చాడు. ఇక్కడ సమంత విషయంలోనే కాదు దుష్యంతుడి పాత్ర విషయంలోనూ ఇదే షాక్.
ఈ పాత్ర కోసం పలువురు పర భాషా నటులను పరిశీలించి చివరికి మలయాళ నటుడు దేవ్ మోహన్ ని ఎంపిక చేసుకున్నాడు. ఇతనికి మన టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేదు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి తెలీదనే చెప్పాలి. అయితే గుణశేఖర్ కాబట్టి కథ ..సమంత ఆయన పేరు మీదే సినిమా పబ్లిసిటీ అయిపోతుంది. మహాభారత ఆదిపర్వం నుంచి అందమైన ప్రేమకథను ఆవిష్కరించబోతున్న గుణశేఖర్ ఇటీవల ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కోలీవుడ్ సినిమాలో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
Shakumtalam : అదితి బాలన్ ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ హీరోయిన్ శాకుంతలం సెట్స్ లో కూడా జాయిన్ అయిందన్న సమాచారం అందుతోంది. శకుంతల ఇష్టసఖి పాత్ర కూడా శాకుంతలంలో ఉండగా.. ఆ పాత్ర పేరు ప్రియంవద. కాగా ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకమవడంతో పలువురు యంగ్ హీరోయిన్స్ ని పరిశీలించిన దర్శక బృందం చివరికి అదితి బాలన్ ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారయిన నేపథ్యంలో గుణశేఖర్ శాకుంతలం సినిమాని ఎంతో జాగ్రత్తగా పక్కా ప్లాన్తో తెరకెక్కిస్తున్నాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!