టాలీవుడ్ లో ఏదైనా డేరింగ్ గా స్టెప్ తీసుకునే దర్శకుండంటే అది ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. పడి లేచిన కెరటం లాంటి పూరి సునామీని చూసొచ్చాడు. జీవితం అంటే ఇంతే అన్న టేకిటీజీ పాలసీ ని మేయింటైన్ చేస్తున్న పూరి తన ఆలోచన విధానం ఎలాంటిదో తన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. గత కొంతకాలంగా వరసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. డబుల్ ఎనర్జీతో ఒకేసారి రెండు సినిమాలని మొదలు పెట్టాడు.
పూరి తన కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొడుకు నటిస్తున్న సినిమాకి పూరి కథ తో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి నిర్మిస్తున్నారు. పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
విజయ్ దేవరకొండతో పూరి ఫైటర్ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – అనన్య పాండే ల మీద కొంత టాకీ పార్ట్ కూడా కంప్లీటయుంది. ఇందుకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు పూరి. అయితే ఈ సినిమాల తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడన్నది అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది.
పూరి సినిమాని మొదలు పెట్టి 4 నెలల్లో రిలీజ్ చేయగలడు. అందుకే ఏ హీరో అయినా పూరి తో సినిమా చేయడానికి రెడిగా ఉంటారు. ఈ క్రమంలోనే పూరి – బాలయ్య కాంబినేషన్ లో సినిమా అని ప్రచారం జరిగుతుంది. అంతేకాదు రీసెంట్ గా పూరి.. నాగార్జున తో హ్యాట్రిక్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సినిమా అయ్యాక కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో పూరి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే అటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు అక్కినేని ఫ్యాన్స్ కి షాకే అంటున్నారు.