సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మహేష్ బాబు, ఎస్ ఎస్ థమన్ కాంబినేషన్ 7 ఏళ్ళ తర్వాత రిపీటవుతుండటం విశేషం.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని, మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తుందని.. ఈ హీరోయిన్ ని మహేష్ బాబు సతీమణి నమ్రత రిఫెర్ చేస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరన్నది చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించలేదు.
ఈ క్రమంలో ఇప్పుడు సర్కారు వారి పాట లో నటించే హీరోయిన్.. అంటూ మరో బాలీవుడ్ బ్యూటీ పేరు ప్రచారంలోకి వచ్చింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతుంది అనన్య పాండే. పాన్ ఇండియా సినిమా కావడంతో ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకొని ఉండటంతో పూరి తన సినిమాకోసం అనన్య ని ఎంపిక చేసుకున్నాడు.
ఇప్పుడు ఇదే హీరోయిన్ సర్కారు వారి పాట లో నటించబోతుందన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది.