సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అన్నది మొదటి సినిమాకే పనికొస్తుంది. ఆ తర్వాత హీరో అయినా హీరోయిన్ అయినా సొంత కాళ్ళ మీద నిలబడాల్సిందే. తండ్రి స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ అయినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారన్న గ్యారెంటీ లేదు. తమకి తాముగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి. ప్రేక్షకులని మెప్పించాలి. లేదంటే శ్రీదేవి కూతురైనా.. మెగా ఫ్యామిలీ హీరో అయినా… స్టార్ డైరెక్టర్ కొడుకైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కాని శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అ తర్వాత కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్.
ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా నటన వాళ్ళ బ్లడ్ లోనే ఉందని ప్రూవ్ చేశారు. అంతేకాదు ప్రేక్షకులను మెప్పించడానికి డాన్స్ .. యాక్టింగ్.. ఫైట్స్ ఇలా ప్రతీ దాంట్లో ప్రత్యేకతను చాటుతున్నారు. ఇందుకోసం కొన్ని సందర్భాలలో గాయాలపాలైన మెగా హీరోలు కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నాలలో ఉన్నాడు. అయితే పూరి తన కొడుకుని ఒక డైరెక్టర్ కొడుకుగా కాకుండా చాలా నార్మల్ గానే ట్రీట్ చేస్తున్నారు.
ఆకాష్ కు ముందు నుంచి యాక్టింగ్ మీదే ఆసక్తి ఎక్కువ. అందుకే చినతనంలో తండ్రి నిద్ర లెచే సరికి స్టార్ హీరోల సినిమాలలోని డైలాగ్ ఒకటి చెప్పి ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగే వాడు. ఇదే విషయాన్ని పూరి పలు సందర్భాలలో వెల్లడించాడు. ఆ ఆసక్తి కారణంగానే పూరి తన కొడుకుని ముందు చైల్డ్ ఆర్టిస్ట్ ని చేశాడు. తన దర్శకత్వం లో వచ్చిన బిజ్జిగాడు లాంటి సినిమాలలో చిన్నప్పటి హీరో పాత్రల్లో నటింపజేశాడు.
ఆ తర్వాత ఆంధ్రా పోరి సినిమాతో హీరోగా మారిన ఆకాష్ తో మాస్ హీరోగా మెహబూబా అన్న సినిమాని తెరకెక్కించాడు. కాని ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే మెహబూబా సినిమా కి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కాగా ప్రస్తుతం రొమాంటిక్ అన్న సినిమాలో నటించాడు ఆకాష్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో పూరి – ఛార్మి డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా థియోటర్స్ లో రిలీజ్ చేయాలా లేక ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేయాలా అని ఆలోచనలో పడ్డారట. త్వరలో ఇందుకు సంబంధించి పూరి ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.