Puri jagannaadh : పూరి జగన్నాధ్ ప్రస్తుతం లైగర్ అన్న సినిమా చేస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. లైగర్ ప్రస్తుతం ముంబై లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
లైగర్ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పాన్ ఇండియన్ సినిమా అయినా పూరి చాలా తక్కువ బడ్జెట్ లోనే లైగర్ ని కంప్లీట్ చేస్తాడట. ఇంతకముందే పాన్ ఇండియన్ సినిమా అంటే 300 కోట్లు అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ని దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అధికారకంగాను మేకర్స్ ప్రకటించారు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లైగర్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే లైగర్ అన్న టైటిల్ తో పాటు విజయ్ లుక్ కి అలాగే సాలా క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ లైన్ కి మంచి బజ్ క్రియేట్ అయింది.
Puri jagannaadh: పూరి జగన్నాధ్ నాగ శౌర్య హీరోగా సినిమా చేస్తే మాత్రం భారీ హిట్ దక్కుతుంది..!
ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ ఒక చిన్న హీరో తో సినిమా చేస్తాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరోనే నాగ శౌర్య. ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గాని నిజంగా పూరి జగన్నాధ్ నాగ శౌర్య హీరోగా సినిమా చేస్తే మాత్రం ఈ యంగ్ హీరో కెరీర్ మలుపు తిరిగినట్టే అంటున్నారు.ఛలో తర్వాత మళ్ళీ నాగ శౌర్య కి భారీ హిట్ దక్కలేదు. అయితే గత కొంతకాలంగా నాగ శౌర్య మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం కోసం తెగ ట్రై చేస్తున్నాడు. కాని వర్కౌట్ అవడం లేదు. ఇలాంటి సమయంలో పూరి ఛాన్స్ ఇస్తే భారీ హిట్ దక్కుతుంది.