Puri jagannaath : తెలుగు సినిమా పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎలాంటి పేరుందో దాని గురించి ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన పని లేదు. బద్రి తో ఆయన డైరెక్టర్ గా మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసి బ్లాక్ బస్టర్ అందుకొని ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా సెటిలయ్యాడు. ఆయన తీసే మాస్ ఎంటర్టైనర్ సినిమాలలో హీరోగా నటించేందుకు తెలుగు సినిమా హీరోలు మాత్రమే కాదు అటు కన్నడ ఇటు హిందీ స్టార్ హీరోలు కూడా ఎంతో ఆతృతగా ఉంటారు. ఎందుకంటే హీరోలకి పూరి ఇచ్చే మాస్ హీరో ఇమేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
అందుకే టాలీవుడ్ లో చిన్న హీరోలు దగ్గర్నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారి వరకు అందరూ నటించారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా పూరి జగన్నాథ్ సినిమాని ఒకేలా తీస్తాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా హీరోకి భారీ స్థాయిలో మాస్ క్రేజ్ వచ్చేలా చేస్తాడు. మహేష్ బాబు తో పోకిరి, బిజినెస్ మాన్, పవన్ కళ్యాణ్ తో బద్రి. కెమరా మాన్ గంగతో రాంబాబు, ఎన్.టి.ఆర్ తో ఆంధ్రావాలా, టెంపర్, గోపీచంద్ తో గోలీమార్, నితిన్ తో హార్ట్ ఎటాక్, కళ్యాణ్ రాం తో ఇజం..ఇలా దాదాపు పక్కా కమర్షియల్ సినిమాలే తీశాడు.
Puri jagannaath : నిర్మాతగా, దర్శకుడిగా లైగర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా బిగ్ బి..బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరే బాప్ అనే మాస్ ఎంటర్టైనర్ కూడా తీసి హిందీ సీమలో అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి బాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి మాస్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఆయన నిర్మాతగా, దర్శకుడిగా లైగర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో 120 కోట్ల బడ్జెట్ తో లైగర్ నాలుగు సౌత్ భాషలలో ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక వరుసగా బాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించబోతున్నాడట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?