డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిరంజీవి కి వీరాభిమాని. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన పూరి ఆయనని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా పూరి డైరెక్షన్ లోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు, ప్రేక్షకులు భావించారు. పూరి కథ కూడా సిద్దం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కి పూరి రాసిన కథ బాగా నచ్చింది. చిరంజీవి కి ఫస్ట్ హాఫ్ నచ్చి ఎక్కడో సెకండాఫ్ తృప్తి లేకపోవడంతో మెగాస్టార్ 150 పూరి డైరెక్షన్ లో రాలేదు.
ఆ తర్వాత తమిళ రీమేక్ కత్తి సినిమాతో చిరంజీవి 150 సినిమా చేసి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో చిరంజీవి లో స్టామినా ఏమాత్రం తగ్గలేదని డాన్సుల విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా అని నిరూపించుకున్నారు. ఇక ఎప్పటి నుంచో కలగా మిగిన ఒక కథ ని సైరా గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి పాన్ ఇండియా రేంజ్ సినిమాగా రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు చిరు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. అయితే రీసెంట్ గా పూరి జగన్నాధ్ దాదాపు 6-7 కథ లు రాసినట్టు నిర్మాత ఛార్మీ వెల్లడించింది. ఒక పదేళ్ళకి సరిపడా కథ రాసిన పూరి వాటిని స్టార్స్ తో తెరకెక్కిస్తాడట. ఇక వీటిలో ఒక కథ మెగాస్టార్ కోసమే అన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు తాజాగా పూరి చిరు కలిశారన్న వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఇలా సీక్రెట్ గా కలిసింది మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా చేసి ఫ్యాన్స్ ని సంతోష పెట్టేందుకే అని తెలుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?