మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడబోతుండగా మొరటుగా కనిపించే లారీ డ్రైవర్ ‘పుష్ప రాజ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే పుష్ప ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లో జరుపుకోవాల్సి ఉండగా ప్రస్తుతం లాంగ్ షెడ్యూల్ ని తూర్పుగోదావరి జిల్లా మారేడు పల్లి లోని ఫారెస్ట్ లో జరుపుతున్నారు. 2021 సమ్మర్ టార్గెట్ గా పెట్టుకొని సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాకోసం అల్లు అర్జున్ – సుకుమార్ ఫారెస్ట్ లో వేకువ జామునే లేచి షూటింగ్ మొదలు పెడుతున్నారట. ఖచ్చితంగా ఉదయం 6 గంటలకి ఫస్ట్ షాట్ తీస్తున్నాడట సుకుమార్. అల్లు అర్జున్ ఇందుకోసం ఉదయం 4 గంటలకే లేచి సిద్దమవుతున్నాడని సమాచారం. అయితే సుకుమార్ ప్రతీ షాట్ విషయంలో పక్కాగా ఉంటాడు కాబట్టి రోజు మొత్తం లో ఒక్క సీన్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతున్నట్టు సమాచారం. సుకుమార్ ప్రతి సినిమాకి ఇలానే సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు పుష్ప కోసం మరింత కేర్ తీసుకుంటునట్టు చెప్పుకుంటున్నారు. ఇక అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి.