Radhe Shyam: ముందు నుంచి ప్రభాస్కు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాస్ హీరోగా, యాక్షన్ హీరోగానే. ఛత్రపతి, బాహుబలి, సాహో సినిమాల తర్వాత ఆ ఇమేజ్ అసాధారణ స్థాయికి చేరుకుంది. అయితే, మధ్యలో ప్రభాస్ మాస్ ఇమేజ్ను కొద్దిగా టచ్ చేస్తూ మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి ప్రేమ కథా చిత్రాలు చేశారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అంతకంటే గొప్ప ప్రేమకథను ప్రభాస్తో తీస్తే మాత్రం అది వర్కౌట్ కాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’.
ఈ సినిమా మొదట రోజే మంచి గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు మూవీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ 79 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ వసూళ్లు తెచ్చింది ‘రాధేశ్యామ్’. అయితే, ఈ సినిమా ముందునుంచి విజువల్ వండర్ గా రూపొందిస్తున్నట్టు హైప్ క్రియేట్ చేశారు. అందుకే టీజర్..ట్రైలర్..ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ కూడా క్లాస్ ఎలిమెంట్స్తోనే వదిలారు. ఇదే విషయం సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్ధమైంది. యాక్షన్ కూడా ఉంటాయని ప్రచారం సాగినా కూడా అది కేవలం సినిమా మీద బజ్ క్రియేట్ అవడానికి చేసిన ప్రచారమే అని తెలిసింది.
Radhe Shyam: స్లో పాయిజన్లా ఎక్కుతుందని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో సగటు ప్రేక్షకుడు ప్రభాస్ నుంచి కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. బాహుబలి, సాహో సినిమాల మైండ్ సెట్ నుంచి కంప్లీట్ బయటకు వచ్చి..ప్రభాస్ మాస్ ఇమేక్ కాకుండా మంచి క్లాస్ ఇమేజ్ వచ్చేలా దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేశాడు. ప్రభాస్ కూడా చేసిన జోనర్లోనే కాకుండా కాస్త కొత్తగా ఫ్రెష్ ఫీల్ ఉండేలా ఆలోచించే ‘రాధేశ్యామ్’ కమిటైనట్టు తెలుస్తోంది. కంప్లీట్ క్లాస్ ఆడియన్స్ను ‘రాధేశ్యామ్’ మంచి విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. వారు ఇలాంటి చిత్రాలను బాగా ఆదరిస్తారు. కాబట్టి స్లో పాయిజన్లా ‘రాధేశ్యామ్’ ఎక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంకా ఆర్ఆర్ఆర్ రిలీజ్కు సమయం ఉంది కాబట్టి ‘రాధేశ్యామ్’ బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పుకుంటున్నారు.