టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కి ఇస్మార్ట్ శంకర్ కి ముందు నటించిన సినిమాలన్ని పెద్దగా సక్సస్ కాలేదన్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గానో ఫ్లాప్ గానో మిగిలాయి. కాని ఇస్మార్ట్ శంకర్ తో మాత్రం భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదే ఎనర్జీతో ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ కూడా మొదలవబోతుందన్న వార్తలు వచ్చాయి.
అయితే తమిళంలో భారీ మాస్ హిట్ అందుకున్న తడం సినిమాని రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. అనుకున్నట్టుగానే ఈ సినిమా రీమేక్ రెడ్ లో నటించాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా రామ్ పట్టుపట్టాడా లేక దర్శక, నిర్మాతలు పట్టుదలగా ఉన్నారా తెలీదు గాని థియోటర్స్ ఓపెన్ అయ్యాకే రాం నటించిన రెడ్ సినిమా రిలీజ్ చేస్తామని అంటున్నారు. స్రవంతీ మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవి కిషోర్ నిర్మించగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా కంప్లీటయినప్పటికి రాం మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు. గత కొన్ని రోజుల క్రిత్రం రాం – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా మొదలవబోతోందని వార్తలు వచ్చాయి. కాని అఫీషియల్ గా సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా.. అలాగే అఖిల్ అక్కినేని నటించబోతున్న అఖిల్ 5 ని చేయబోతున్నట్టు ప్రకటించాడు.
దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా లేదని క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత త్రివిక్రం – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆర్ ఆర్ ఆర్ వల్ల లేటవుతున్న కారణంగా ఈ లోపు త్రివిక్రం .. రాం తో సినిమా చేస్తాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాని ఎన్.టి.ఆర్ మార్చ్ నుంచి త్రివిక్రం ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.
అయితే రాం తో సినిమా చేసేందుకు పలువురు యంగ్ డైరెక్టర్ రెడీగా ఉన్నప్పటికీ రాం ఆసక్తి చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని ప్రస్తుతానికి రాం లేటెస్ట్ మూవీ మాత్రం మొదలవడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు.