Rangasthalam : రంగస్థలం సినిమా తెలుగులో ఎంత పెద్ద కమర్షియల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ – సమంత అక్కినేని జంటగా.. ఆది సాయి కుమార్, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది. వినికిడి లోపం ఉన్న పాత్రలో చరణ్ నటన అద్భుతం అని ప్రతీ ఒక్కరు ప్రశంసలతో ముంచేశారు. సమంత నేచురల్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అయింది.
కాగా ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయితే తమిళంలో 7జి ఫిలిమ్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇంతక ముందు రంగస్థలం సినిమాను మలయాళంలో రిలీజ్ చేశారు. మలయాళంలో ప్రేక్షకులను రంగస్థలం బాగా ఆకట్టుకుంది. డీసెంట్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు తెలుగులో రంగస్థలం వచ్చిన మూడేళ్ళకి తమిళంలో రాబోతోంది. అక్కడ డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 30 రిలీజ్ చేయనున్నారు.
Rangasthalam : రంగస్థలం తమిళ వెర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రంగస్థలం తమిళ వెర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ అభిమానుల నుంచి.. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి రెసాన్స్ వస్తోంది. చరణ్ సినిమాలు కొన్ని ఇప్పటికే తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది రాం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు