రియా .. రియా .. రియా..సుశాంత్ మృతి తర్వాత అంతటా మార్మోగిపోతున్న పేరు. ఈ కేసులో సీబీఐ ఎంక్వౌరీ జెట్ స్పీడ్ లో సాగుతోంది. ఇప్పటికే సుశాంత్ సన్నిహితుడిగా పేరున్న సిద్దార్థ్ తో పాటు ఇంట్లో పని వారిని, రియాను.. రియా సోదరుడిని కూడా ఎంక్వౌరీ చేస్తున్నారు. శుక్రవారం , శనివారం.. ఆదివారం రియా ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ మూడు రోజుల్లోను రెండు ప్రశ్నలకు రియా సరైన సమాధానం చెప్పలేదు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలు పదే పదే అడిగిన సమయంలో రియా గట్టిగా అరిచినట్లుగా తెలుస్తుంది.
సీబీఐ వారు రియాను జూన్ 8న సుశాంత్ ఇంటి నుండి వెళ్లి పోయారు కదా.. అప్పటికి అతడి నుండి బ్రేకప్ అయ్యారా.. ఔను సమాధానం అయితే ఎందుకు బ్రేకప్ అయ్యారు. మరో ప్రశ్న మీరు సుశాంత్ నుండి దూరం వెళ్లి పోయాక మీ ఆరోగ్యం గురించి అతడు మీ సోదరుడికి కాల్ చేసి తెలుసుకునేవాడు. మరి మీరు అలా ఏమైనా చేశారా? అంటూ సీబీఐ వారు ప్రశ్నించారు.
ఈ రెండు ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడిగినప్పుడు రియా పొంతన లేకుండా రకరకాల సమాధానాలు చెప్పడంతో పాటు నన్ను అనవసరంగా విసిగిస్తున్నారంటూ.. ఎంక్వౌరీ ఆఫీసర్ పై అరిచినట్లుగా తెలుస్తోంది. సుశాంత్ విషయంలోనే కాకుండా డ్రగ్స్ విషయంలో కూడా ఈమెను ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇక మళ్ళీ రియాను ఎప్పుడు ఎంక్వౌరీ చేయనున్నది ఇంకా క్లారిటీ లేదు.
అయితే రియా ఇలా ఆ రెండు ప్రశ్న లకి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకి తెరతీసింది. అందరికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే విషయంలో సీబీఐ వారు పట్టు వదలకుండా ఆ రెండు ప్రశ్నలకి రియా నుంచి సమాధానం రాబట్టాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారట. మరి సిబిఐ వారు మూడురోజుల పాటు ఆపకుండా 7 గంటలు ప్రశ్నించినా ఆ రెండు ప్రశ్నలకి రియా సమాధానం ఎందుకు చెప్పడం లేదన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది.