డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. కొమరం భీం గా ఎన్.టి.ఆర్. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ ఎంతో శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా..అందులోను మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలు అనగానే యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. కాని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తో సినిమా ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది.
అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే రాం చరణ్, ఎన్.టి.ఆర్ సెంటర్ పాయింట్ దగ్గర కలవడం అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములుగా మారిపోయి మంచి ఎమోషనల్ గా సాగుతుందట. అన్నదమ్ములుగా మారినప్పటి నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ కి ప్రేక్షకులు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారట. అంతేకాదు ఈ ఇద్దరిని కలిపేది ఆలియా భట్ అని సమాచారం. అదే గనక నిజమైతే ఆర్ ఆర్ ఆర్ హిట్ ని ఏ ఒక్కరు అంచనా వేయలేరు అని చెప్పుకుంటున్నారు.