నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్రం “వై” కేటగిరి భద్రత కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వద్ద ఎంపీ రాజు రేంజ్ పెరిగిందా?సీఎం జగన్ సీను తగ్గిందా? అన్న చర్చలు మొదలయ్యాయి.భద్రత కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనా కేంద్రం అప్పుడు నిమ్మగడ్డ..ఇప్పుడు రఘురామరాజు విషయంలో వెంటనే స్పందించటం పైన వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.కొద్దికాలంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తు౦డడం ముఖ్యమంత్రి జగన్ ,వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుండడం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి తదితరులు తీవ్రంగా స్పందించారు. ఎంపీ గారి ఫ్లెక్సీలు కూడా తగలబెట్టారు.ఆయన పై పోలీసు కేసులు కూడా పెట్టడం జరిగింది. దీంతో తనకు ఏపీ లో వైసిపి ఎమ్మెల్యే లతో ముప్పు ఉందని కేంద్రానికి ఎంపీ రఘురాం కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు.ముందు స్పీకర్ ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాను నియోజకవర్గంలోకి వెళ్ళలేను అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.దానిని పరిశీలించిన స్పీకర్ హోం శాఖకు పంపించారు. నిజా నిజాలు పరిశీలించి ఆయనకు భద్రత కల్పించాలి అని ఆయన సూచనలు చేసారు. ఈ లోపు ఎంపీ తనకు భద్రత కావాలంటూ ఢిల్లీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపధ్యంలో రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి మేరకు ఆయనకి కేంద్రం భద్రత కల్పించింది . 11 మందితో కూడిన భద్రత ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది. జరిగింది ఇదే కావచ్చు కానీ ఇది చిన్న విషయం మాత్రం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తనకు సంబంధం లేని విషయంలో కేంద్రం వేలు పెట్టటం ఇక్కడ గమనార్హం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పాదం మోపాలన్న ప్రయత్నాల్లో ఉన్న కమలనాథులు ఇందుకు ఒక నిచ్చెనగా రఘురామ కృష్ణంరాజును ఉపయోగించుకోవడానికి ఆయన కోరినట్లు భద్రత కల్పించార కల్పించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైడ్ లైన్ చేయడమే అంటున్నారు. నిజానికి ఎంపీ రాజుకున్న బలం తక్కువే అయినా ప్రస్తుతానికి ఆయన బిజెపికి బాహుబలి లాగా కనిపిస్తున్నారు అన్నది ఒక కామెంట్.