సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ కా బాప్ లాంటి హిట్ తర్వాత ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించబోతుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వహించబోతున్న ఈ సినిమా కి రీసెంట్ గా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ సినిమాని జీఎంబీ .. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలవబోతోంది. హైదరాబాద్ లో కూడా భారీ బ్యాంక్ సెట్ నిర్మిస్తున్నారు. ఆ బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట మొదలవబోతోంది. ఈ సెట్ లో దాదాపు నెల రోజులకి పైగానే షూటింగ్ జరపనున్నారట. ఆ తర్వాత అమెరికాలో 45 రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ తో దాదాపు గా సర్కారు వారి పాట కంప్లీట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారట.
కాగా ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ అన్న విషయం తెలిసిందే. అలాగే మరో హీరోయిన్ కూడా మహేష్ తో రొమాన్స్ చేయబోతుందన్న వార్తలు ముందు నుంచి వస్తున్నాయి. ఆ హీరోయిన్ కూడా ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయీ మంజ్రేకర్ నే సర్కారు వారి పాట టీం ఫైనల్ చేసిందట. ఇప్పటికే సాయీ మంజ్రేకర్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ నటిస్తున్న మేజర్ లో నటించింది. ఆ కారణంగానే ఇప్పుడు సర్కారు వారి పాటకి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ లో కూడా సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?