సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో వరసగా క్రేజీ మూవీస్ చేస్తోంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ లో నేచురల్ పర్ఫార్మర్ గా క్రేజ్ సంపాదించుకున్న sai pallavi చేతిలో ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. ఇప్పటికే sai pallavi నాగ చైతన్య తో లవ్ స్టోరీ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే నాని తో మరో సారి నటిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమాలో sai pallavi ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి నటిస్తుంది.
అలాగే sai pallavi రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం అన్న సినిమా చేస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కమిటయిన మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం లో కూడా sai pallavi నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – రాణా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా చేసేందుకు sai pallavi గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
కాగా ఎప్పటి నుంచో sai pallavi స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప లో నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మరో హీరోయిన్ గా సాయి పల్లవి ని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి .. అల్లు అర్జున్ కి చెల్లిగా కనిపించాల్సి ఉంటుందట. మరి ఇది నిజమా కాదా అన్నది క్లారిటీ లేనప్పటికి వరసగా స్టార్ హీరోల తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఇలాంటి సమయంలో చెల్లి పాత్రకి sai pallavi ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారట.