Samantha – Tamannah: సినిమా హీరో, హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇది బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కల్చర్ అని చెప్పాలి. బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ హోస్టులుగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. స్టార్స్ చేసే స్మాల్ స్క్రీన్ షోస్ హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఉదాహరణకి బిగ్ బాస్ రియాలిటీ షోనే. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ఆయన ఈ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నందుకు గానూ షాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
ఇదే రియాలిటీ షో తెలుగులో, తమిళంలో ఇప్పుడు సీజన్ 5 కంటిన్యూ అవుతోంది. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా సక్సెస్ఫుల్గా హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ముందు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్గా నడిపించాడు. అద్భుతమైన రేటింగ్తో సీజన్ 1 సక్సెస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని నడిపించాడు. అయితే సీజన్ 1 కంటే సీజన్ 2 అంతగా సక్సెస్ కాలేదనే టాక్ వచ్చింది. దాంతో సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జునను బిగ్ బాస్కి హోస్ట్గా స్టార్ మా తీసుకుంది.
Samantha – Tamannah: తమన్నా ప్లేస్లో సమంత వచ్చింది.
నాగార్జున హోస్ట్ అయినప్పటి నుంచి వరుసగా బిగ్ బాస్ 3,4,5 సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా మీలో ఎవరు కోటీశ్వరులు రియాలిటీ షో స్మాల్ స్క్రీన్పై సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ షోకి నాగార్జునకి హోస్ట్గా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్గా వ్యవహరిస్తూ షోను సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు. ప్రేక్షకులు అటు ఎవరు మీలో కోటీశ్వరులు, ఇటు బిగ్ బాస్ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రెండు షోలు పోటాపోటీగా సాగుతున్నాయి.
అయితే స్మాల్ స్క్రీన్ మీద షోస్ సక్సెస్ అవుతుంది స్టార్ హీరోలతోనే గానీ, స్టార్ హీరోయిన్స్ వల్ల సక్సెస్ కావని తేలిపోయింది. ఆ మధ్య అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మొదలు పెట్టిన తెలుగు ఓటీటీ ఆహా కోసం సమంత ఓ సెలబ్రిటీ షో ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి, రకుల్ ప్రీత్ సింగ్, రానా లాంటి స్టార్స్ను ఇంటర్వ్యూస్ చేసింది. వాస్తవంగా ఈ షోకి ముందు తమన్నా హోస్ట్ అన్నారు. కానీ తమన్నా ప్లేస్లో సమంత వచ్చింది. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత షోను ఆపేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి ఈ షోకి డైరెక్టర్. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.
Samantha – Tamannah: సమంత, తమన్నా హోస్టులుగా పనికిరారని చెప్పుకుంటున్నారు.
అలాగే ఇటీవల తమన్నా హోస్ట్గా మాస్టర్ ఛెఫ్ అనే కుకరీ షో ప్రారంభం అయింది. అమెరికాలో ఈ షో బాగా పాపులర్. అందుకే సన్ నెట్వర్క్ వారు తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలో మొదలు పెట్టారు. తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ షోకి హోస్ట్. తెలుగులో తమన్నా హోస్ట్గా వ్యవహరిస్తోంది. అయితే ఆమె షోకి మైనస్ అని టాక్ వచ్చింది. భాష మీద పట్టు లేకపోవడంతో ఈ కుకరీ షోకి తమన్నా మైనస్ అయినట్టు నిర్వాహకులు భావించారట. అందుకే ఇప్పుడు తమన్నా ప్లేస్లో స్మాల్ స్క్రీన్ పాపులర్ యాంకర్ కం నటి అనసూయ హోస్ట్గా వ్యవహరించనున్నట్టు లేటెస్ట్ న్యూస్. మొత్తానికి సమంత, తమన్నా హోస్టులుగా పనికిరారని చెప్పుకుంటున్నారు.