టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఒక పెద్ద సంచలనం. ఈ సినిమాతో క్రియోటైన ట్రెండ్ యూత్ లో చాలా విషయాలలో మార్పులు తెచ్చింది. వాస్తవంగా పెళ్ళి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్ ఎన్నో కాంట్రవరీలకి దారి తీసినప్పటికి అదే జనాలకి బాగా నచ్చింది.
చెప్పాలంటే ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఇదే సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియారా అద్వాని లతో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్ లో షాహిద్, కియారా క్రేజే మారిపోయింది. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లోనే మరో సినిమా చేబోతున్నాడు.
స్క్రిప్ట్ రెడీ చేసుకొని భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. దాంతో ఈ దర్శకుడి ప్లాన్ అన్నీ తారుమారై వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యాడు. లేడీ ఓరియెంటెడ్ గా రూపొందబోయో ఈ వెబ్ సిరీస్ లో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని తాజా సమాచారం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ హిందీ తో పాటు అన్ని దక్షిణ భాషలలోను రిలీజ్ కానుందట. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం. ఇక మరోసారి అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో రిపీట్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి.