అభిమానుల అంచనాలను అందుకోవడం రాను రాను స్టార్ హీరోలకి పెద్ద సవాల్ గా మారుతోంది. వాళ్ళ అభిమానంతో తమ హీరో మీద…వాళ్ళ నుంచి వచ్చే సినిమా మీద ఎన్నో రకాల అంచనాలు పెట్టుకుంటున్నారు..పెంచేసుకుంటున్నారు. అయితే ఎన్ని రకాలుగా సర్ప్రైజ్ చేసిన ఫ్యాన్స్ కి ఇంకా ఏదో కావాలి..అన్న మాటే వినిపిస్తుంది. గత వారం రోజులుగా మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమా గురించి ఫ్యాన్స్ ఇలానే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కాని ఆ అంచనాలు సర్కారు వారి పాట అందుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఫ్యాన్స్ కి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర యూనిట్. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో ఈ 27 వ సినిమాకి గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తుండగా జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సర్ప్రైజ్ కోసమే మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తాగా రిలీజైన సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్ లో కొంతమంది హ్యాపీగా ఫీలయినప్పటికి కొంతమంది మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యారట. అందుకు కారణం లేకపోలేదు. సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ లో మహేష్ బాబు ని రివీల్ చేస్తారనుకున్న ఫ్యాన్స్ కి చుక్కెదురైంది.
ఈ విషయంలో సర్కారు వారి పాట టీం ఫ్యాన్స్ అంచనాలను చేరుకోలేపోయిందని అంటున్నారు. అంతేకాదు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిసప్పాయింట్ చేసిందన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్స్ విషయంలో క్లారిటీ వస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. ఇవన్ని మహేష్ ఫ్యాన్స్ నే కాదు కొంతమంది కామన్ ఆడియన్స్ కి కాస్త నిరాశ కలిగించిన అంశాలు.