Sekhar kammula : క్లాస్ చిత్రాల దర్శకుడు అంటే టాలీవుడ్ లో గుర్తొచ్చేది శేఖర్ కమ్ముల మాత్రమే. సున్నితమైన అంశాలను కమర్షియల్ అంశాలతో సినిమా తీసి అందరి మన్నలను పొందుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లకుండా మీడియమ్ బడ్జెట్ సినిమాలతోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. పెద్ద హీరోలు అంటే ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు వరుణ్ తేజ్, రానా, నాగ చైతన్య, సుమంత్ మాత్రమే నటించారు. ఆయన నుంచి వచ్చింది కూడా తక్కువ సినిమాలే. అయినా హిట్స్ ఎక్కువ ఉన్నాయి. గత చిత్రం ఫిదా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.
ప్రస్తుతం తెరకెక్కించిన లవ్ స్టోరి రిలీజ్ చేసే సన్నాహాలలో నిర్మాతలు ఉన్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన రొమాంటిక్ సినిమాను మొదటిసారి ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సునీల్ నారంగ్ సొంత బ్యానర్ పెట్టి నిర్మించారు. ఇందులో రెండవ సినిమాగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నారు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా కి సంబంధించిన కొన్ని వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి గాని మేకర్స్ వెల్లడించలేదు.
Sekhar kammula : ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఈ పాన్ ఇండియన్ సినిమాలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
అయితే నిన్న ( గురువారం 17 ) హింట్ ఇచ్చారు చిత్ర బృందం. అన్నట్టుగానే ఈ రోజు ( శుక్రవారం 18 ) శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ లో ఏషియన్ వారు ఒక పాన్ ఇండియన్ మూవీ నిర్మించబోతున్నట్టు దీనిని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ ప్రకటన రాగానే అందరూ మాట్లాడుకుంది హీరోయిన్ గురించే. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమచారం ప్రకారం ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఈ పాన్ ఇండియన్ సినిమాలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందట.