Sekhar kammula : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరి. ఈ నెల 16న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోందని మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. మజిలీ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. అలాగే శేఖర్ కమ్ముల – సాయి పల్లవి కాంబినేషన్ ఫిదా తర్వాత మళ్ళీ రిపీటవుతుండటంతో లవ్ స్టోరి సినిమా మీద భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక సారంగ దరియా సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ అలాగే ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ‘ఏవో ఏవో కలలే’ సాంగ్ ఆ అంచనాలు మరింతగా పెంచాయి.
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టు స్వయంగా మేకర్స్ అఫీషియల్గా ప్రెస్మీట్ ద్వారా వెల్లడించారు. అయితే ఇక్కడ రెండు కారణాలున్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ గుసగుసలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ ఈ శుక్రవారం ( ఏప్రిల్ 9 ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఎలాంటి సంచలనాలు సృష్ఠిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనాని కూడా లెక్క చేయకుండా పవర్ స్టార్ అభిమానులు, ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.
Sekhar kammula : లవ్ స్టోరిని వకీల్ సాబ్ కి దగ్గర్లో రిలీజ్ చేయకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు..!
మరో పది పదిహేను రోజులు వకీల్ సాబ్ జోరు బాక్సాఫీస్ వద్ద కాస్తైనా తగ్గేలా కనిపించడం లేదంటున్నారు. ఇవన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల బృందం ముందుగానే పసిగట్టి తమ లవ్ స్టోరి సినిమా రిలీజ్ పోస్ట్పోన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఒకరకంగా శేఖర్ కమ్ముల బృందం తీసుకున్న డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అంటున్నారు. లవ్ స్టోరి మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమాకి పోటీ లేకపోతే మాత్రం భారీ వసూళ్ళు రాబట్టడం ఖాయం. అందుకే ఈ సినిమా వకీల్ సాబ్ కి దగ్గర్లో రిలీజ్ చేయకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.