Shekhar kammula : క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి టాలీవుడ్లో చాలామందికి షాకిచ్చాడు. తన టాలెంట్ కి మన స్టార్ హీరోలెవరైనా మంచి క్లాస్ కథతో సినిమా చేయొచ్చు. కానీ ఆయన ఇప్పటివరకు చేసిన సినిమా అంటే మెగా ప్రిన్స్ వరుణ్తోనే. అదే ఫిదా సినిమా. ఈ సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సాయి పల్లవి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు నాగ చైతన్య – సాయి పల్లవిలతో లవ్ స్టోరి సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాతో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ వారు నిర్మాతలుగా మారి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు క్రియేటయి ఉన్నాయి.
త్వరలో లవ్ స్టోరి రిలీజ్కి రెడీ చేస్తున్నారు. కాగా ఇదే నిర్మాతలతో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల ఒక త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. అలాగే మూడు భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కూడా సాయి పల్లవి హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి. ఇక ధనుష్కి ఈ సినిమా తెలుగులో స్ట్రైట్ సినిమా కాగా, సాయి పల్లవి గనక హీరోయిన్గా ఫిక్స్ అయితే ఆమెకి, డైరెక్టర్ శేఖర్ కమ్ములకి బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా.
Shekhar kammula : శేఖర్ కమ్ముల సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నారట.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను అప్పటి మద్రాసు రాజధానిగా ఉన్నసమయంలో తెలుగు-తమిళ రాష్ట్రాలకు సంబంధించిన పలు వాస్తవ సంఘటనలతో తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆనాటి పరిస్థితులను.. తమిళ, తెలుగు ప్రజల స్నేహం సహా భావోద్వేగాలను హృదయాలకి హత్తుకునే విషయంగా శేఖర్ కమ్ముల సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నారట. అంతేకాదు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కించనునట్టు మరో వార్త కూడా మొదలైంది. వీటిలో ఏది నిజమో తెలియాలంటే మేకర్స్ స్పందించేవరకు వెయిట్ చేయాల్సిందే.