మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో శృతిహాసన్ మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా సక్సస్ మీద అందరూ ఎంతో ఆశగా ఉన్నారు.
ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ లోను శృతిహాసన్ నటిస్తుంది. స్క్రీన్ మీద కనిపించేది తక్కువ సేపే అయినా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటుందని సమాచారం. అంతేకాదు చాలాకాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నా కూడా రెమ్యూనరేషన్ విషయంలో శృతిహాసన్ కాంప్రమైజ్ కాలేదన్న టాక్ కూడా టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ ఇప్పుడు ఒక కొత్త సినిమాని అంగీకరించిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు శింబు.
శృతిహాసన్ తెలుగులో రవితేజ క్రాక్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు తమిళంలో లాభం అన్న సినిమాని చేస్తుంది. ఈ సినిమాని విజయ్ సేతుపతి నిర్మిస్తున్నాడు. అంతేకాదు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధన్సిక, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూనే శింబు సినిమాకి శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక శింబు ప్రస్తుతం ‘మహా’, ‘మానాడు’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. ఈ సినిమాలోనే శింబు సరసన శ్రుతీహాసన్ నటించబోతుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో రానుందట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!