Srivishnu : కరోన కారణంగా గత సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా థియేటర్స్ క్లోజ్ అవడం నిర్మాతలకి కోలుకోలేని దెబ్బ. అయితే దానికి కాస్త ఓటీటీలు చాలా వరకు సహకరించాయి. కంప్లీట్ వ్యాపార ధోరణిలో చూసుకున్నా కూడా డిజిటల్ ప్లాట్ ఫాంస్ వల్ల చాలా వరకు నిర్మాతలే కాదు ప్రతీ సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ మంచే జరిగింది. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం చాలా సినిమాలు ఓటీటీలో వచ్చి అలరిస్తున్నాయి.
వాస్తవంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు ఎప్పుడు థియేట్రికల్ రిలీజ్ అవుతాయో ఎవరూ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటిటి రిలీజ్ కూడా ఎప్పుడు అవుతాయో మేకర్స్ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. అందుకు కారణం కన్ఫ్యూజన్ క్రియేట్ అవడమే. ఓటీటీలో వచ్చేస్తాయని అనుకున్న సినిమాలు ఆశతో థియేటర్స్ లో వస్తాయని మేకర్స్ డెసిషన్ మార్చుకుంటున్నారు. ఉదాహరణ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్. ఈ సినిమా ముందు ఓటీటీలో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిముషంలో మేకర్స్ డెసిషన్ మార్చుకున్నారు.
Srivishnu : రాజ రాజ చోర థియేటర్స్ కంటే ఓటీటీ రిలీజ్ బెటర్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
క్రాక్ సినిమా థియేటర్స్ రిలీజ్ భారీ సక్సెస్ కావడంతో వైల్డ్ డాగ్ కూడా ఓటీటీ రిలీజ్ నుంచి థియేటర్స్ రిలీజ్ కి వచ్చి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర థియేటర్స్ కంటే ఓటీటీ రిలీజ్ బెటర్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. థియేటర్స్ ఓపెన్ అయినా పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని తట్టుకొని నిలబడాలంటే కాస్త కష్టమే. అందుకే ఓటీటీలో మంచి ఆఫర్ వస్తుందని అక్కడ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. సినిమా బావుంటే ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.