సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత నటించబోతున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట”. పరశురాం పెట్లా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా ఎంపికైంది. కాగా ఈపాటికే మొదలు కావాల్సిన షుటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించడంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ను తీసుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ బాలీవుడ్ బ్యూటీకి హిందీ సినిమాలలో నటించి సౌత్ లో మంచి క్రేజే ఉంది. పైగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కి అత్యంత సన్నిహితురాలు. అందుకే స్వయంగా నమ్రత రిఫర్ చేసిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్ రివీల్ చేయలేదు.
అయితే “సర్కారువారి పాట” సినిమాలో సయీ మంజ్రేకర్ నటించే విషయంలో డైలమా ఉందన్న మాట వినిపిస్తోంది. కాని ఇప్పటికే మహేష్ నిర్మాణంలో రూపొందుతున్న మేజర్ అన్న సినిమాలో అడవి శేష్ తో కలిసి నటిస్తుంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ లో కూడా హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినప్పటికి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది. మరి ఈ విషయాన్ని మహేష్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?