అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పాపులారిటీని సంపాదించుకున్నాడు సురేందర్ రెడ్డి. సినిమాని చాలా క్లాస్ గా తీస్తాడన్న పేరుంది. హీరోని అద్భుతంగా ఎలివేట్ చేస్తాడు. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు సురేందర్ రెడ్డి అంటే బాగా ఆసక్తి చూపిస్తారు. అల్లు అర్జున్ తో రేసు గుర్రం, ఎన్.టి.ఆర్ తో అశోక్, ఊసరవెల్లి, రాం చరణ్ తో ధృవ తీసి తన సత్తా ని చాటాడు. ముఖ్యంగా ధృవ సినిమా మెగాస్టార్ ని బాగా ఇంప్రెస్ చేసింది. ఇక చరణ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో ఏకంగా సురేందర్ రెడ్డి కి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు రాం చరణ్.
సైరా లాంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సురేందర్ రెడ్డి మీద పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి విశ్లేషకుల నుంచి ప్రశంసలు విమర్శలు రెండు అందుకున్నాడు. అందులో విమర్శలే ఎక్కువగా వచ్చాయన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ప్రభావం సూరి మీద ఎక్కువగా పడిందని అంటున్నారు. అందుకనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఎవరితో అన్నది ఫైనల్ కాలేదు.
సైరా గతేడాది అక్టోబర్ లో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు తన తర్వాత సినిమా ఏ హీరోతో.. అనేది ఇంతవరకు వెల్లడించలేదు సురేందర్. దాదాపు 9 నెలలు గడుస్తున్నా సురేందర్ తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పకపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. వాస్తవంగా అయితే సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాని వరుణ్ తేజ్ తో చేస్తాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత హీరో రామ్ తో అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాస్ రాజా రవితేజతో తదుపరి సినిమా అని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి ఏ హీరో సినిమా ఫైనల్ అవుతుందన్నది క్లారిటీ లేదు. మొత్తానికి సురేందర్ రెడ్డి మీద సైరా ప్రభావం బాగానే పడినట్టుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?