ముక్కుసూటిగా ..ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దర్శకుడు తేజ. సినిమా అంటే కొన్ని లెక్కలు ఖచ్చితంగా పాటించాలన్న క్లారిటీ ఉన్న దర్శకుడు. కథ, కథనం, పాత్రలను మలచడంలో గొప్ప టాలెంట్ ఉన్న దర్శకుడు. చిన్న సినిమా తీసి టాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా మారిపోయారు. లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తేజ గత కొంత కాలంగా ట్రెండ్ మార్చి నేనే రాజు నేనే మంత్రి లాంటి సెన్షేషనల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. జోగేంద్ర గా రానా ని అద్భుతంగా చూపించాడు. అయితే ఆ తర్వాత తీసిన సీత మాత్రం నిరాశ పరచింది.
ఇక ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో తేజ ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. అదే ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఈ సినిమా కి హీరోయిన్ సమస్య వచ్చి పడింది. ఎంత ప్రయత్నిస్తున్న గోపీచంద్ కి సరిపోయో ఇంకా చెప్పాలంటే తేజ రాసుకున్న పాత్రకి సూటయ్యో హీరోయిన్ దొరకడం లేదు. ముఖ్యంగా ఈ కథ అలిమేలు మంగ పాత్ర మీదే సాగుతుందట. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం అలిమేలు మంగగా సాయి పల్లవి ని ఫైనల్ చేస్తారని అంటున్నారు. వాస్తవంగా అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్, అనుష్క లలో హీరోయిన్ గా ఒకరిని తీసుకోవాలనుకున్నారు. కానీ కాజల్, అనుష్క ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరట. ప్రస్తుతం కాజల్ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్ సినిమా ఉన్నాయి.
ఇక అనుష్క అన్నీ సినిమాలని ఒప్పుకోవడం లేదట. దాంతో హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకున్నారట తేజ. కాని ఇప్పటికే కీర్తి వరుస సినిమాలు ఒప్పుకుని 2021 వరకూ బిజీగా వుందట. దాంతో తేజ.. సాయి పల్లవి ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట తేజ. మరి తేజ కి సాయి పల్లవి అయినా సెట్ అవుతుందా లేక మళ్ళీ ఇంకో హీరోయిన్ వెతుక్కోవాలా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.