సైరా లాంటి పాన్ ఇండియా సినిమా తీసి మరో మెట్టు పైకెక్కాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవడమే కాదు పాన్ ఇండియా డైరెక్టర్ జాబితాలో కూడా చేరాడు. అయితే సైరా వచ్చి ఇన్ని నెలలవుతున్నా కూడా సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా ఫైనల్ కాలేదు. సైరా చేస్తున్నప్పుడే సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా మహెష్ బాబు తో ఉంటుందని రచారం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ తో అని వార్తలు వచ్చాయి. కాని అవన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి.
ఇక ముందు నుంచి మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ ..ఇలా అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి కి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకి మాత్రం ఒక్క స్టార్ హీరో దొరకడం లేదని సమాచారం. ఒకే ఆప్షన్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉన్నాడని అంటున్నారు. అయితే చరణ్ నెక్స్ట్ సినిమాని వంశీ పైడిపల్లి తో చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సురేందర్ రెడ్డి యంగ్ హీరో ఎనర్జిటిక్ హీరో రాం తో చేస్తాడన్న టాక్ ఉంది. రాం ప్రస్తుతం రెడ్ సినిమా కంప్లీట్ చేసి ఉన్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ చేసే సినిమా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్ సెట్ అయ్యోలా ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో సురేందర్ రెడ్డి క్లారిటి ఇస్తే గాని తన నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలియదు.