ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ గా అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి prabhas మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. ఏ సినిమా చేసిన ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు కనీసం 200 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయిస్తున్నారు నిర్మాతలు. సాహో సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కి prabhas రేంజ్ ని మరింతగా పెంచేసింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ప్రభాస్ మార్కెట్ మాత్రం ఆకాశాన్ని అంటుకుంటోంది.
prabhas ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యాం 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 750 కోట్ల వరకు కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సలార్ బడ్జెట్ కూడా దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ప్రముఖ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సినిమా బడ్జెట్ కూడా 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది prabhas రేంజ్. ఇక ఈ సినిమాల బిజినెస్ కూడా దాదాపు 2000 కోట్ల కి మించి జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి పాన్ ఇండియన్ క్రేజ్ కోసం టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ రేంజ్ కి త్వరగా చేరుకునే హీరో స్టైలిష్ స్టార్ allu arjun అన్న టాక్ వినిపిస్తోంది. అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మొత్తంగా మారిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియన్ సినిమా అంతగా క్రేజ్ సంపాదించుకుంది. 2020 లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో allu arjun రేంజ్ దాదాపు ప్రభాస్ అంత వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ స్థాయికి చేరుకుంటాడా లేదా.