డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విరూపాక్ష సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పీరియాడికల్ మూవీ కావడంతో ఎక్కువ మంది యూనిట్ సభ్యులు అవసరం కావడం తో పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. తక్కువ యూనిట్ సభ్యుల తో హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడు.
మళ్ళీ క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా తిరిగి మొదలవడానికి 2021 వచ్చేస్తుంది. అందుకే క్రిష్ ‘ఆహా’ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమ్ కానున్న ఒక వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయడానికి అంగీకరించారు. అలాగే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కాగా వైష్ణవ్ తేజ్ సినిమా వికారాబాద్ ప్రాంతం లో ఉన్న ఫారెస్ట్ అలాగే అక్కడ ఉన్న ఓ కొండ ప్రాంతం దగ్గర చిత్రీకరణ జరిపేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశారు. 40 రోజుల పాటు నిర్విరామంగా సాగే సింగల్ షెడ్యూల్ లో చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. అటవీ ప్రాంత ప్రజలు కరువు వచ్చినప్పుడు ఆహారం సంపాదించడం కోసం ఎలా కష్టపడ్డారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నుండి హైదరాబాద్ కి చేరుకుందని తెలుస్తుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమా చిత్రీకరణ కోసం క హైదరాబాద్ చేరిందని అందరు అనుకున్నారు. కానీ టాలీవుడ్ సినీ వర్గాల ప్రకారం… క్రిష్ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు రకుల్ ప్రీత్ హైదరాబాద్ కి చేరుకున్నారని… వైష్ణవ్ తేజ్ తో కలిసి సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతుందని తెలుస్తోంది.
ఇక కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎటువంటి చాలెంజింగ్ రోల్ లో కనిపించబోతున్నారన్నది సస్పెన్స్ గా ఉంచారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అటవిక జీవితాన్ని గడుపుతున్న యువతిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన థియేటర్లలోనే విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.