ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా అద్వాని స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది. అంతేకాదు స్టార్ హీరోలు – దర్శకుల తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ధోనీ సినిమా తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న కియారా ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ అన్న వెబ్ సిరీస్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన కియారా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇటీవలే స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో నటించిన సౌత్ సూపర్ హిట్ కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ లో నటించింది. ఈ సినిమా కూడా కియారా అకౌంట్ లో మంచి హిట్ గా చేరింది.
కాగా ప్రస్తుతం మరో క్రేజీ సినిమాలో నటించింది కియారా అద్వాని. ‘ఇందూకి జవానీ’ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజవగా కియారా పర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో కియారా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాలో కియారా చాలా విభిన్నంగా కనిపించబోతోందని బాలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారట. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన అమ్మాయిగా ‘ఇందూకి జవానీ’ సినిమాలో కియారా నటించింది.
కాగా ఈ సినిమాలో డేటింగ్ యాప్ లను నమ్మి మోసపోయే అమ్మాయిగా కియారా సందడి చేయబోతోందట. అదృష్ఠం – దురదృష్ఠం అన్న ఎమోషనల్ కాన్సెప్ట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించాడట దర్శకుడు అబీర్ సేన్ గుప్తా. అయితే కియారా పాత్ర ని డిజైన్ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టిందట.. సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉండాలి.. ఎలాంటి హావా భావాలు పలికించాలి.. లాంటి అంశాల మీద చాలా శ్రమించాడట దర్శకుడు. వల్గారిటీ లేకుండా మంచి కామెడీ తో సినిమా లోని కియారా పాత్ర ఉంటుందని ఆ పాత్ర లో కియారా పర్ఫెక్ట్ గా సూటయిందని దర్శకుడు చెబుతున్నాడట. కాగా ఈ సినిమా డిసెంబర్ 11 న థియోటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.