మలయాళ సినిమా ప్రేమమ్ తో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాతో ప్రేక్షకులని బాగానే ఆకట్తుంది. చూడగానే అచ్చ తెలుగమ్మాయిలా అనిపిస్తుంది. ప్రేక్షకులు అదే ఫీలయ్యారు. ఇలాంటి అమ్మాయి తెలుగు సినిమాలు అందునా కుటుంబ కథా చిత్రాలలో బాగా సూటవరుతారు. ఇలాంటి అమ్మాయికోసం కొన్ని కథలు ఎదురు చూస్తుంటాయి.
ఈ కారణంగానే తెలుగులో మంచి సినిమాలు చేసింది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్రేమమ్ చూసి టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆయన దర్శకత్వంలో నితిన్, సమంత హీరో, హీరోయిన్స్ గా రూపొందిన అ..ఆ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా అయినప్పటికి నెగిటివ్ క్యారెక్టర్ లో ఒప్పుకొని సాహసమే చేసిందని చెప్పాలి. అయితే సమంత మేయిన్ హీరోయిన్ అవడం వల్ల అంతగా ఈ సినిమా ప్లస్ కాలేదని చెప్పాలి.
ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ కి జంటగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో దిగి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో అనుపమ కి వరసగా సినిమాలు చేసే అవకాశం దక్కిన్ది. రాం తో ఉన్నది ఒక్కటే జిందగీ, నాని తో కృష్ణార్జున యుద్ధం, సాయి ధరం తేజ్ తో తేజ్ ఐ లవ్ యు, అలాగే మరోసారి రాం తో హలో గురు ప్రేమ కోసమే సినిమాలు వరస బెట్టి చేసింది.
అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవడంతో అనుపమ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వీటిలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా అనుమప రేంజ్ ఇంకోలా ఉండేది. కాని అక్కడే బ్యాడ్ లక్ వెంటాడింది. దాంతో క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తాయని ఆశపడ్డ అనుపమకి గ్యాప్ వచ్చింది. అయితే ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు హిట్ అయింది. కాని అనుపమ కి అవకాశాలు మాత్రం రావడం లేదు.
అందుకు కారణాలు లేకపోలేదు. హీరోయిన్ అంటే కాస్త గ్లామర్ టచ్ ఉన్న పాత్రలు చేయాలి. అవసరమైతే స్కిన్ షో చేయాలి. కాని అనుపమ వాటికి దూరంగా ఉంది. అదే సమయంలో టాలీవుడ్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ లాంటి వాళ్ళు దూసుకు రావడం కూడా అనుపమకి బాగా మైనస్ అయిందని చెప్పుకుంటున్నారు. కాని ఇక్కడ టాలెంట్ ముఖ్యం.. గ్లామ, స్కిన్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం పొరాటే. అనుపమ లో మంచి టాలెంట్ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి కమర్షియల్ సినిమాలో నటించే అవకాశాలు వచ్చినా రావచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?